బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ2 : తాండవం’. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.
ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నాం.
ఈ చిత్రం భారతదేశ ఆత్మ, పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. భగవద్గీత, రామాయణం, మహా భారతం.. ఇవి మన దేశ ఆత్మ.
ఈ మూడింటికి ఉన్న ఆత్మే ఈ చిత్రం’ అని అన్నారు. త్రీడీలో ఈ చిత్రం ఆడియెన్స్కు విజువల్ ఎక్స్పీరియెన్స్ను అందించబోతోందని నిర్మాతలు అన్నారు. నటుడు రచ్చ రవి, డిఓపి సంతోష్, ఎడిటర్ తమ్మి రాజు పాల్గొన్నారు.
