హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న అఖిలేశ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ఘన స్వాగతం పలికారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని ఎయిర్పోర్టు బయట అఖిలేశ్మీడియాతో అన్నారు. ‘‘సబ్కా లక్ష్య్ ఏక్హై.. బీజేపీకో హఠానే చహతాహై ఇస్ కేలియే రాస్తా బనారే” అని అఖిలేశ్అన్నారు. తాను కేసీఆర్తో చర్చించేందుకు వెళ్తున్నానని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే అందరి లక్ష్యమైనప్పుడు ఇందుకు అందరూ కలవాల్సినఅవసరం ఉందన్నారు. కాగా, అక్కడి నుంచి ప్రగతి భవన్కు వెళ్లిన అఖిలేశ్, ఎస్పీ నాయకులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
బీఆర్ఎస్, ఎస్పీ నేతలు ప్రగతి భవన్లోనే లంచ్ చేశారు. కేసీఆర్, అఖిలేశ్ భేటీలో జాతీయ రాజకీయాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల సమావేశం, ఎన్సీపీలో చీలిక సహా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. బీహార్ రాజధాని పాట్నాలో జూన్లో నిర్వహించిన బీజేపీ యేతర పార్టీల మీటింగ్కు బీఆర్ఎస్ను ఆహ్వానించలేదు. సోమవారమే బెంగళూరులో ఈ పార్టీల రెండో మీటింగ్నిర్వహించాల్సి ఉండగా ఎన్సీపీలో చీలిక కారణంగా సమావేశం వాయిదా పడింది. ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్ముఖ్యనేత రాహుల్గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్షాల భేటీకి బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే తాము రాబోమని చెప్పినట్లు ప్రకటించారు.
బీజేపీకి ‘బీ’ టీమ్గా పనిచేస్తున్న బీఆర్ఎస్తో భవిష్యత్తులోనూ కలిసేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ముఖ్యనేత రాహుల్ గాంధీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కామెంట్స్చేసిన మరుసటి రోజే హైదరాబాద్లో అఖిలేశ్ దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. రాహుల్గాంధీ కూటమికి నాయకత్వం వహించే పక్షంలో తాము కలిసి వచ్చేది లేదని కేసీఆర్చెప్పినట్టుగా బీఆర్ఎస్వర్గాలు వెల్లడించాయి.