
ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ ‘ఫస్ట్ టైం యునానిమస్గా బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ఎందులోనూ 3 రేటింగ్కి తక్కువ లేదు. ఇందులో నాది బ్యూటిఫుల్ క్యారెక్టర్.
నాకు ఎప్పటినుంచో ఇలాంటి కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. నా పాత్రకి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఈ కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా. ఈ జర్నీలో నాగార్జున గారు ఎంతో ధైర్యాన్ని నింపారు. అలాగే ధనుష్ గారు కూడా. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతీ దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది.
నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పారు. సినిమాకొచ్చిన రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నామని, బుకింగ్స్ టెర్రిఫిక్గా ఉన్నాయని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. ఈ సినిమాకి వరల్డ్వైడ్గా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత పుస్కూర్ రామ్ మోహన్ రావు అన్నారు.