సక్సెస్, ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసేస్తున్నాడు అక్షయ్ కుమార్. ఇటీవల ‘రామ్ సేతు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్, మరో రియల్ లైఫ్ స్టోరీలో నటిస్తున్నాడు. జశ్వంత్ సింగ్ గిల్ అనే మైనింగ్ ఇంజినీర్ బయోపిక్ ఇది. 1989లో పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ బొగ్గు గని వరదల్లో చిక్కుకున్న అరవై నాలుగు మంది కార్మికులను రక్షించి రియల్ లైఫ్ హీరో అయ్యారు జస్వంత్.
ఇది జరిగి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన సేవలను కేంద్ర బొగ్గు శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో గుర్తు చేశారు. జోషి పోస్టుకు స్పందించిన అక్షయ్.. ఈ సినిమా డిటైల్స్ చెప్పాడు. మనదేశపు మొట్టమొదటి ‘బొగ్గు గని రెస్క్యూ మిషన్ ఇదని, గిల్ పాత్ర పోషించడం గర్వంగా ఉందని చెప్పాడు. ‘క్యాప్సుల్ గిల్’ పేరుతో రూపొందుతోన్న ఈ మూవీని పూజా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అక్షయ్తో ‘రుస్తుం’ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానుంది.