అక్షయ విద్యా ఫౌండేషన్ కు రెండు బస్సులు

అక్షయ విద్యా ఫౌండేషన్ కు  రెండు బస్సులు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని అక్షయ విద్యా ఫౌండేషన్​కు ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా రెండు బస్సులు కేటాయిస్తామని సంస్థ ఎండీ వి.సి.సజ్జనార్ అన్నారు. ఫౌండేషన్​నిర్వాహకులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 

సైన్స్​సెంటర్​ప్రారంభిస్తున్నామని, ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తామని తెలిపారు. సెంటర్​కు చేరుకోవడానికి పిల్లలకు రవాణా సదుపాయం కల్పించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఫౌండేషన్​ వైస్​ చైర్మన్​టి.ప్రసాద్,​ గవర్నింగ్​బాడీ సభ్యుడు మురళీధర్, ప్రాజెక్ట్​హెడ్​ శ్రీనివాస్, మేనేజర్ హైమా తదితరులున్నారు.