
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సర్కారు గతంలో ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను వెబ్సైట్లో పెట్టకుండా చీకటి పాలన చేసిందని, కొత్త ప్రభుత్వం అన్ని జీవోలు, మెమోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.
జీవోలను పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లో పెడితే బాగుంటుందని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లలో సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచితే పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. జీవోలన్నీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుని పారదర్శక పాలన చేయాలని ఆకునూరి మురళి కోరారు.