దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్లో మారేష్ శివన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సుధాకర్ నిర్మించిన సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ ‘ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా విలేజ్ నుంచి ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది.
వారంతా కూడా ఫస్ట్ హాఫ్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరి జీవితాల్లోనూ కామన్గా ఉంటుంది. సినిమా చూసిన చాలా మంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందని అన్నారు. సినిమా బాగా తీశారని మా నాన్న (కొమ్మాలపాటి శ్రీధర్) మెచ్చుకున్నారు. కథకు ఏం కావాలో అదే చేశాం. అంతే ఖర్చు పెట్టాం. రియల్ లొకేషన్లోనే తెరకెక్కించాం.
మారేష్ డైరెక్షన్తో పాటు సుభాష్ ఆనంద్ మ్యూజిక్, చంద్రబోస్ గారి పాటలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని చెప్పారు.