
మాదాపూర్, వెలుగు : మాదాపూర్లోని శిల్పారామంలో జరుగుతున్న ఆలిండియా క్రాఫ్ట్ మేళా ఆకట్టుకుంటోంది. వీకెండ్ కావడంతో ఆదివారం సందర్శకుల రద్దీ కనిపించింది. మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్లో వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళా ఉత్పత్తుల కొనుగోళ్లతో సందడి నెలకొంది.
సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగగా.. గౌతమ్ కుమార్ దాస్ బృందం ప్రదర్శించిన బిహు డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.