
నీళ్లపై తెలంగాణకు నష్టం చేసింది కేసీఆరేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వపాపాలు చేసింది కేసీఆర్,హరీశేనన్నారు. 2016లోనే బనకచర్లకు బీజం పడిందని..ఈ పాపానికి పునాది వేసింది కేసీఆరేనన్నారు రేవంత్. గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను మీడియా ముందు ప్రజంట్ చేశారు సీఎం రేవంత్.
బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యం 200 టీఎంసీలు కాదు 300 టీఎంసీలు.. ఆనాడు 400 టీఎంసీలు తరలించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. జగన్ ,కేసీఆర్ నాలుగు సార్లు సమావేశమయ్యారు.. ఓ కాంట్రాక్టర్ వాళ్లిద్దరి సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టులకు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లియ్యలేదని విమర్శించారు. మూడేండ్లలో కాళేశ్వరం కడితే కూలిపోయిందన్నారు. దక్షిణ తెలంగాకు కేసీఆర్ ద్రోహం చేశారని విమర్శించారు.
రేవంత్ కీలక కామెంట్స్
- బనకచర్లపై అఖిలపక్షంలో ఎంపీల అభిప్రాయం తీసుకున్నాం
- బనకచర్లపై పోరాటానికి అన్ని అంశాలు చర్చించాం
- ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు
- గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించాం
- భవిష్యత్ కార్యాచారణపై ఎంపీల సూచనలు కోరాం
- రాష్ట్రానికి ఏ కష్టమొచ్చిన బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం కోరుకుంటోంది
- చనిపోయిన బీఆర్ఎస్ పార్టీని పునరుజ్జీవింప చేసుకునే ప్రయత్నం చేస్తోంది
- రాజకీయ ప్రయోజనాలు,సంకుచిత స్వాభావంతో బీఆర్ఎస్ పనిచేస్తోంది
- గత పదేళ్లలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఈ శాఖ చూశారు
- కేసీఆర్ ఐదేళ్లు,హరీశ్ రావు ఐదేళ్లు పనిచేశారు
- బురద జల్లడం ద్వారా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు
- 2016 అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ హరీశ్ కు పంపిస్తాం
- గోదావరి జలాలను కృష్ణాకు తరలించాలని కేసీఆర్ చెప్పారు
- సీమకు నీళ్లివ్వాలన్న పునాది 2016లోనే పడింది
- సముద్రంలో 3వేల టీఎంసీలు కలుస్తాయని.. కృష్ణా బేసిన్ కు తరలించవచ్చని కేసీఆర్ చెప్పారు
- కేసీఆర్, జగన్ నాలుగు సార్లు భేటీ అయ్యారు
- గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని చర్చించారు
- బనకచర్లకు ఆనాడే బీజం వేశారు
- కృష్ణాజలాలు, బనకచర్లపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
- బేసిన్ లు లేవు, బేషాజాలు లేవని కేసీఆర్ అన్నారు
- ఏపీ బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే బీఆర్ఎస్ మాట మారుస్తోది
- 2016లో కేసీఆర్ చెప్పిన దాని ఏపీ ముందుకెళ్తోంది
- బనకచర్ల ప్రాజెక్టు లక్ష్యం 200 టీఎంసీలు కాదు 300 టీఎంసీలు
- ఆనాడు 400 టీఎంసీలు తరలించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు
- సర్వపాపాలు చేసింది కేసీఆర్,హరీశే
- ఈ పాపానికి పునాది వేసింది కేసీఆర్
- జగన్ కేసీఆర్ కలయిక ఓ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం
- నేను ఉత్తమ్..జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశాం
- బనకచర్లపై మేం మొదటి నుంచి పోరాడుతున్నాం
- నీళ్లపై తెలంగాణకు నష్టం చేసింది కేసీఆరే
- తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది
- గ్రావిటితో ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చేవి
- కృష్ణా బేసిన్ లో కేసీఆర్ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా.?
- కాంట్రాక్టర్లకు రూ. 2వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు
- ప్రాజెక్టుల పేరుతో 2 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు
- లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లియ్యలేదు
- మూడేళ్లలోనే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది
- చేసిన తప్పులకు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు
- లేనిది ఉన్నట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు
- పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే డబ్బులు లేవు
- మొత్తం ప్రాజెక్టులను గాలికొదిలేశారు
- అప్పుల భారం తప్పించుకోవడానికి కేంద్రమంత్రులను కలిస్తే తప్పా?
- హరీశ్ కు లో బీపీ, టెన్షన్లు ఎందుకొస్తున్నాయి.
- నీచమైన మనస్తత్వం ఉన్నవాళ్లు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం దురదృష్టం
- పదేళ్లు ఎస్ఎల్ బీసీని పడావు పెట్టారు
- చంద్రబాబుకు నేను ఓ సూచన చేస్తున్నా
- మీకు కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు
- అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తాయనుకుంటే మీ భ్రమ
- ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు
- రాజకీయంగా పోరాడుతాం..లేదంటే న్యాయస్థానాలకు వెళ్తాం
- మా ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీపడం
- గోదావరి బేసిన్ లోనూ మా ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోంది
- కేసీఆర్ చేసి పాపం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదు
- దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్ ద్రోహం చేశారు
- గోదావరిలో మాకు హక్కుగా ఉన్న968 టీఎంసీలు వినియోగించుకునేందకు అనుమతివ్వండి