ఏపీ అలా చేస్తే బనకచర్లకు అడ్డుచెప్పం: సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ అలా చేస్తే బనకచర్లకు అడ్డుచెప్పం: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి బేసిన్ లో తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరిలో  హక్కుగా ఉన్న968 టీఎంసీలు వినియోగించుకునేందుకు తమకు  అనుమతివ్వాలన్నారు. కృష్ణా బేసిన్ లో 500 టీఎంసీలకు,  గోదావరి బేసిన్ లో 1000 టీఎంసీలకు ఎన్ వోసీ ఇస్తే ఏపీ బనకచర్లకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమన్నారు సీఎం రేవంత్. 

ALSO READ | చంద్రబాబు.. కేంద్రంలో పలుకుబడి ఉందనుకోవద్దు..బనకచర్ల ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు

తమ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉన్నాయని ఏపీ చెబుతోంది.. కృష్ణా జలాల్లో  పదేళ్లలో 299 టీఎంసీలు ఏనాడైనా వాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వస్తున్నాయన్నారు రేవంత్.  ఐదు నెలలుగా తెలంగాణ అభ్యంతరాలతోనే బనకచర్ల అనుమతిపై కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు రేవంత్.  కేసీఆర్ చేసి పాపం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని..దక్షిణ తెలంగాణలో  ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్ ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు రేవంత్. 

 తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే..ఇవాళ బనకచర్లపై తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షం నిర్వహించారు. ఏపీ చేపడుతోన్న బనకచర్ల వల్ల తెలంగాణకు జరుగుతోన్న నష్టంపై వివరించారు. ప్రధాని మోదీని కలిసి బనకచర్లపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు రేవంత్.