
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు రెండు వేర్వేరు చోట్ల ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి రుద్రవరంలో రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్న కార్మికుడిని ఢీ కొట్టిండు. ఈ ఘటనలో సదయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కారును ఆపకుండా అతివేగంగా వెళ్లి మళ్లీ అరెపల్లిలో బైక్ పై వేములవాడకి వస్తున్న మరో ఇద్దర్ని ఢీ కొట్టిండు. ఈ ఘటనలో వేములవాడకి చెందిన పండరనాథ్ (25) అనే యువకుడు మృతి చెందగా చందు అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. మద్యం మత్తులోనే బండరాయిని ఢీ కొట్టడంతో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు.