
భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా.. అని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.అంతేకాదు ఐలవ్ పాకిస్తాన్..మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నిన్న రాత్రి అతనితో మాట్లాడాను..మేం భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం..పాకిస్తాన్ , భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ’’ ట్రంప్ బుధవారం(జూన్ 18) బుధవారం నాడు ట్రంప్ వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు భోజన విందుకు ఆతిథ్యం ఇవ్వనున్న కొన్ని గంటల ముందు ఈ కామెంట్స్ చేశారు.
ALSO READ | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మన భారతీయుడేనా..?: యూపీ నుంచి వెళ్లిన పూర్వీకుల కుటుంబం
పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత సీజ్ ఫైర్ పై అమెరికా ట్రంప్ అధ్యక్షుడు ప్రకటన చేయడం.. సీజ్ ఫైర్ విషయంలో విదేశీ జోక్యంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ మూడో వ్యక్తి జోక్యాన్ని అంగీకరంచదు.. భవిష్యత్తులోకూడా జరగదని’’ స్పష్టం చేశారు. మోదీ మాట్లాడిన కొద్ది గంటల తర్వాత ట్రంప్.. సీజ్ ఫైర్ పై తన వ్యాఖ్యలను మరోసారి నొక్కిచెప్పడం చర్చనీయాంశమైంది.
భారత్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇద్దరు మంచివారే అన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు చేరశారు. యుద్దం ఆపేందుకు ఇద్దరు ముందుకు వచ్చారు. భారత్ , పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలు.. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. అయితే ఇది సెన్సేషనల్ అని నేను అనుకోను అని అన్నారు ట్రంప్.
అంతకుముందు ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ..మే నెలలో భారత్ పాక్ మధ్య సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం రెండు సైన్యాలు నేరుగా తీసుకున్నాయని స్పష్టం చేశారు. 35 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కెనడా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రధాని మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా ప్రధాని నిరాకరించారని..ఇద్దరు నాయకులు త్వరలో కలవడానికి అంగీకరించారని భారత విదేశాంగ ప్రధాని కార్యదర్వి మిస్రి చెప్పారు.
మే 10న భారత్-పాకిస్తాన్ మధ్య శత్రుత్వాలను తగ్గించినట్లు ప్రకటించిన మొదటి వ్యక్తి ట్రంప్. అప్పటి నుండి ఉద్రిక్తతలను తగ్గించడంలో తనదే ఘనత అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. శాంతి కోసం రెండు దేశాలతో వాణిజ్యాన్ని తెంచుకునే బెదిరింపును ఉపయోగించుకున్నానని కూడా అంటున్నారు ట్రంప్.