అమిత్ షా సభకు ఏర్పాట్లు పూర్తి

అమిత్  షా సభకు ఏర్పాట్లు పూర్తి

గద్వాల, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పర్యటనకు గద్వాల జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. జిల్లా కేంద్రంలోని మేళ్లచెరువు రోడ్డు పక్కన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం ఉదయం 11:30  గంటలకు అమిత్​ షా గద్వాలకు చేరుకుంటారని ఆమె తెలిపారు.