హైదరాబాద్, వెలుగు: ఈనెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మొత్తం 242 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 80,583 మంది ఫస్ట్ఇయర్స్టూడెంట్లు, 93,784 మంది సెకండ్ఇయర్స్టూడెంట్లు, మొత్తంగా1,74,367 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాయనున్నట్లు పేర్కొన్నారు.
www.tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారాస్టూడెంట్లు తమ హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈజీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునేందుకు ఇంటర్బోర్డు సెంటర్లొకేటర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అవసరమైతే స్టూడెంట్లు ఒకరోజు ముందుగానే సెంటర్ను చూసుకోవాలని సూచించారు. మెంటల్ స్ట్రెస్ను అధిగమించేందుకు కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్14416ను సంప్రదించాలని జిల్లా విద్యాధికారి డి.వడ్డెన్న తెలిపారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మాల్ప్రాక్టీస్ను అరికట్టడానికి నలుగురు ఫ్లైయింగ్, 10 మంది సిట్టింగ్స్క్వాడ్టీమ్స్ను ఏర్పాటు చేశారు.