రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే కాంగ్రెస్కు ద్రోహం చేసిండు

రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే కాంగ్రెస్కు ద్రోహం చేసిండు

మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులంతా పోరాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చు గానీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్, బీజేపీ అధికార, ధన బలంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. మునుగోడు అభివృద్ధికి ఆ రెండు పార్టీలు చేసిందేమి లేదని విమర్శించారు.