
కాంగ్రెస్ పార్టీ ఏపీలో కీలక మార్పులు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసి రెడ్డి, షేక్ మస్తాన్ అలీని నియమించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. 2019 ఎన్నికల తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు.అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.