- అడ్ హక్ కమిటీ చైర్మన్ గణపతి ప్రకాశ్రావు
ముషీరాబాద్,వెలుగు: అఖిల భారత సగర మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏప్రిల్ 28న నిర్వహిస్తామని కొత్తగా ఏర్పాటైన అడ్ హక్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ గణపతి ప్రకాశ్రావు సగర, వైస్ చైర్మన్ శ్రీరాల శ్రీరాములు సాగర్, సభ్యులు ముత్యాల హరికిషన్, శాగబండ ప్రకాశ్, కమటం వేణు గోపాల్, మామిడి విద్యాసాగర్, రాచకొండ గణేశ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ గణపతి ప్రకాశ్రావు మాట్లాడుతూ సిటీలోని బడిచౌడి వద్ద ఉన్న సగర విద్యానిధి ఆవరణలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అడ్ హక్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలని కోరారు. సగర సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై నియమ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.