అచ్చంపేట ఎమ్మెల్యేను అభినందించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

అచ్చంపేట ఎమ్మెల్యేను  అభినందించిన పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్  గౌడ్

అచ్చంపేట, వెలుగు: ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్  బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విశేష కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్  అభినందించారు. శనివారం హైదరాబాద్​లో పీసీసీ చీఫ్​ను ఎమ్మెల్యే కలిసి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

 అచ్చంపేట నియోజకవర్గంలో 174 జీపీలు ఉండగా,127 సర్పంచ్​  స్థానాలను కాంగ్రెస్  మద్దతుదారులు గెలిచారు. 73 శాతం స్థానాలను దక్కించుకొని రాష్ట్రంలో టాప్ టెన్ లో అచ్చంపేట నియోజకవర్గం ఉండడం హర్షనీయమన్నారు. కొత్త సర్పంచులకు పార్టీతో పాటు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని తెలిపారు.