కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని హోటల్స్, బేకరీలు లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి హాటళ్లలో 20 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజినపల్లి మండలంలోని మంగనూరు, పాలెం, వట్టెం,బిజినేపల్లి లలో హోటల్స్ లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్గా వాడుతున్నట్టు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకులపై కేసులు నమోదు చేశారు. హోటల్ యజమానులు ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ సిబ్బంది రవికుమార్, అనురాధ, జగన్నాథం, ప్రసన్న,పోలీస్ సిబ్బంది కృష్ణయ్య ,నరసింహ, రవి పాల్గొన్నారు.
