ఖైరతాబాద్,వెలుగు: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే అంతా విధ్వంసమేనని ప్రొఫెసర్హరగోపాల్పేర్కొన్నారు. గతంలో విద్యకు 6 వేల కోట్లు కేటాయిస్తే..ప్రస్తుతం 2 వేల కోట్లకు తగ్గించి, విద్యా వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. అమెరికా లాంటి దేశాల్లో 90 శాతం ప్రజలకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తుందన్నారు. భారత్బచావో ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈనెల 25,26 తేదీల్లో అఖిల భారత విద్యార్థుల సదస్సు సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం చైర్మన్అన్వర్ఖాన్, భారత్బచావో ఉపాధ్యక్షుడు ఇన్నయ్య,ప్రభాకర్,రమేశ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం సదస్సు పోస్టర్ఆవిష్కరించారు.