లిక్కర్ స్కామ్ నిందితులంతా తీహార్ జైల్లోనే

లిక్కర్ స్కామ్ నిందితులంతా తీహార్ జైల్లోనే

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులందరూ  తీహార్ జైల్ లోనే ఉన్నారు. తాజాగా ఇదే జైలుకు కవితను కూడా తరలించారు. ఈ స్కామ్ లో అరెస్ట్ అయిన వారిలో ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, బినోయ్ బాబు, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, అమన్ దీప్ పాల్ లు ఉన్నారు.

అలాగే సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి,  అరుణ్ పిళ్లై, మాగుంట రాఘవ రెడ్డి లను తీహార్ జైల్ కే పంపించారు. కాగా.. అప్రూవర్లుగా మారడం, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఈ కేసులో పలువురికి బెయిల్ లభించింది. ఈ నెల 20 వ తేదీన కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తోన్న అభిషేక్ బోయినపల్లికి భార్య అనారోగ్యం దృష్ట్యా సుప్రీంకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  దాదాపు 19 నెలల తర్వాత అభిషేక్ కు ఈ తాత్కాలిక ఉపశమనం దక్కింది.