హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే రోడ్లన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజులుగా భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు వెళుతున్నారు.
నగరంలోని మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ, హైటెక్ సిటీ, మాదాపూర్, ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, మణికొండ, పంజాగుట్ట, బంజారా హిల్స్, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
గత మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రైవేట్ బస్సుల్లో .. ప్రత్యేక రైళ్లలోనూ సొంతూళ్లకు వెళ్లారు. నిత్యం బిజీగా కనిపించే హైటెక్సిటీ, ఐటీ కారిడార్, ఐకియా వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి.
