
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ,ఏపీ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపింది. తెలంగాణకు 79 TMCలు, ఏపీకి 69.346 TMCల నీళ్ల విడుదలకు అనుమతి తెలిపింది. తెలంగాణ నీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 15 TMCలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 45 TMCలు కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17TMCలు… మిషన్ భగీరథ కోసం మరో 2 TMCలను కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.