బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ

బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(సీవోఈ) స్కూల్​లో ఏర్పాటు చేసిన అంబేద్కర్​ విగ్రహాన్ని శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్​ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదివి అంబేద్కర్​ మాదిరిగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్​ ఎ.విజయసాగర్, వైస్​ ప్రిన్సిపాల్​ టి.గోపి, పేరెంట్స్​ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, కార్యదర్శి రాజేశం పాల్గొన్నారు.