వికారాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

వికారాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలోని అంబేద్కర్​విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆదివారం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రమేశ్​విగ్రహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ ఘటనకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, అంబేద్కర్ విజ్ఞాన వేదిక నాయకులు డిమాండ్​చేశారు. విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. విజ్ఞాన వేదిక జిల్లా అధ్యకుడు ముత్యప్ప, ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి నర్సింలు తదితరులున్నారు.