అంబులెన్స్ డ్రైవర్లుగా మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. కానీ, పుణేలో ‘నైన్బీ’ అనే సంస్థ విమెన్ అంబులెన్స్ సర్వీసెస్ అందిస్తోంది. ఇంతకీ ఈ అంబులెన్స్లు ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా...
‘స్త్రీ సేఫ్’ పేరుతో ‘నైన్ బీ’ అనే సంస్థ పుణేలో మూడు వారాల కిందట ఆడవాళ్ల అంబులెన్స్ సర్వీసెస్ మొదలుపెట్టింది. తమ వాళ్లను అంబులెన్స్లో తీసుకెళుతున్న ఒంటరి ఆడవాళ్లతో అంబులెన్స్ సిబ్బంది రూడ్గా బిహేవ్ చేస్తున్నారని ‘నైన్ బీ’ అనే సంస్థకు కొందరు చెప్పారట. వెంటనే ఆ సంస్థ ఆడవాళ్ల కోసం ఫ్రీగా అంబులెన్స్ సేవలను స్టార్ట్ చేసింది.ఆడవాళ్లు నడిపే ఈ అంబులెన్స్ మీద పింక్ లెటర్స్లో ‘బై విమెన్, ఫర్ విమెన్’ అని రాసుంటుంది.
కంప్లైంట్స్ రావడంతో...
“మొదట మేము పాత మినీ వ్యాన్ ను అంబులెన్స్గా వాడాలనుకున్నాం. కానీ లాక్డౌన్లో మెడికల్ క్లియరెన్సులు, ఇతర అనుమతులు కష్టం. అందుకే అంబులెన్స్గా రిజిస్టర్ అయిన వాహనాన్నే ఉపయోగిస్తున్నాం’’అని చెబుతారు ‘నైన్బీ’ సంస్థ ఛైర్పర్సన్ అమర్ప్రీత్ సింగ్. ‘స్త్రీ సేఫ్’ అంబులెన్స్ సర్వీస్కు రోజుకు రెండు మూడు కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికైతే ఇద్దరు విమెన్ డ్రైవర్లు ఉన్నారు. మరో అయిదుగురికి డ్రైవింగ్లోనే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు.
అంతేకాకుండా మరో మూడు అంబులెన్స్లు కొనేందుకు ఫండ్ రైజింగ్ కూడా మొదలెట్టారు ‘నైన్ బీ’ మెంబర్స్. తమ అంబులెన్స్ సేవల గురించి సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ఇస్తున్నారు కూడా. ‘స్త్రీ సేఫ్’ సర్వీస్ ఆడవాళ్లకు ఏ భయం లేకుండా అంబులెన్స్లో వెళ్లొచ్చనే ధైర్యాన్ని ఇస్తోంది. త్వరలోనే ఢిల్లీలో కూడా ఇలాంటి అంబులెన్స్నడపాలనే ఆలోచనతో ఉన్నారు ‘నైన్ బీ’ ఫౌండర్స్.