- కొత్త వాటికి ప్రపోజల్స్ పంపినా పట్టించుకోని సర్కారు
- మన్యంలో వైద్యసేవలు పూర్
- పేషంట్లకు తప్పని ఇక్క ట్లు
భద్రాచలం, వెలుగు: మన్యంలో వైద్యసేవలు పూర్గా మారాయి. ఎమర్జెన్సీ టైంలో ఆదుకునే అంబులెన్స్లకు రిపేర్జబ్బు పట్టిపీడిస్తోంది. వాటి స్థానంలో కొత్త వాహనాలకు ప్రపోజల్స్ పంపినా సర్కార్పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎమర్జెన్సీ టైంలో అడవుల్లో ఆగిపోతున్నాయి. దీంతో కీకారణ్యంలో పేషంట్ల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ చర్ల మండలంలో ఓ యువతి పురుగుమందు తాగగా 108కి కాల్ చేశారు. అంబులెన్స్మండలకేంద్రంలోని హాస్పిటల్కు తరలిస్తుండగా మొరాయించింది. దీంతో ఆ యువతి హాస్పిటల్కు చేరుకోవడం ఆలస్యమై ప్రాణాలు విడిచింది. ఇలాంటి ఘటనలు మన్యం ఏరియాలో నిత్యకృత్యమవుతున్నాయి. అంబులెన్స్ల కొరత, ఉన్నవాటికి మెయింటనెన్స్లేకపోవడమే అసలు సమస్య అని పలువురు వాపోతున్నారు.
అంబులెన్స్లకు రిపేర్జబ్బు
భద్రాచలం మన్యంలో అంబులెన్స్లకు రిపేర్జబ్బు పట్టిపీడిస్తోంది. దీంతో పేషంట్లకు సరిగా సేవలు అందని పరిస్థితి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చాలావరకు ఫారెస్ట్ఏరియా కావడంతో వీరికి రవాణా సౌకర్యం తక్కువ. ఉన్నా రోడ్లు సరిగా ఉండవు. వీరికి హెల్త్ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అంబులెన్స్లే దిక్కు. ప్రస్తుతం వీటి కారణంగానే పేషంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పాముకాటు బాధితులు, ఆత్మహత్యాయత్నాలు.. తదితర ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ల సేవలు కీలకం. ఇలాంటి టైంలో అవి అడవిలో నిలిచిపోతుండటంతో పేషంట్ల ప్రాణాలు గాల్లో దీపమవుతున్నాయి. తాజాగా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన మడవి చుకిడీ(25) అనే యువతి పురుగుమందు తాగింది. 108 అంబులెన్స్లో చర్ల హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మొరాయించింది. పేషంట్బంధువులు కిందికి వాహనాన్ని నెట్టినా ముందుకు కదల్లేదు. దీంతో ఓ బైక్పై ఆ యువతిని ఎక్కించుకుని హాస్పిటల్కు పోయేసరికి అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో ఆదుకోవాల్సిన అంబులెన్స్ రిపేర్కారణంగా ఆ యువతి ప్రాణాలు పోయాయి. గతంలో చుంచుపల్లి మండలంలో త్రీఇంక్లైన్ ఏరియాలో కూడా ఆవు, దూడను బైక్తో ఢీకొట్టి అపస్మారక స్థితికి చేరిన యువకుడిని తీసుకెళ్లేందుకు 108కు ఫోన్ చేస్తే అది రిపేర్లో ఉండి రాకపోవడంతో ఆటోలో తీసుకెళ్లాల్సి వచ్చింది.
రిపేర్ కు వస్తే ఖమ్మానికే...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 108 వాహనాలు 21 వరకు ఉన్నాయి. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, అశ్వాపురం, గుండాల, ఇల్లెందు, జూలూరుపాడు, చండ్రుగొండ మండలాల్లోని 8 అంబులెన్స్లు పాడైపోయాయి. తరుచూ రిపేర్లకు గురవుతున్నాయి. టేకులపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు మండలాల అంబులెన్స్లైతే పూర్తిగా పాడైపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం వాహనాలు రిపేర్లతో నడిపిస్తున్నారు. వీటి మెయింటనెన్స్, పర్యవేక్షణ సరిగా ఉండటం లేదు. రిపేర్ వస్తే ఖమ్మంలోని వెల్డర్ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. జీవీకే సంస్థ ఆధ్వర్యంలో నడిచే 108 అంబులెన్స్లకు ఖమ్మంలోనే రిపేర్లు చేస్తున్నారు. క్రెడిట్వెల్డర్ బిల్లులు వచ్చేంత వరకు వారే ఖర్చు భరిస్తున్నారు. బయట ఎక్కడైనా రిపేర్ చేయిస్తే వెంటనే బిల్లులు చెల్లించాలి. ఈకారణంగా170 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల అంబులెన్స్ను ఖమ్మంకు రిపేర్ కోసం తీసుకెళ్లాల్సి వస్తోంది. అంతదూరం తీసుకెళ్లాలన్నా మరో వాహనం కావాల్సి వస్తుండటంతో మూలన
పడేస్తున్నారు. ఫలితంగా రోగులకు ఇబ్బందికరంగా మారింది.