
అఫ్గాన్ చర్చలపైనా దీని ప్రభావం
వెల్లడించిన అమెరికా సీఆర్ఎస్ రిపోర్టు
వాషింగ్టన్: కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని, మానవ హక్కులను గౌరవించాలని కోరుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. అటానమస్ రద్దుతో కాశ్మీర్లో టెన్షన్ నెలకొందని కాంగ్రెషనల్రీసెర్చ్సర్వీస్(సీఆర్ఎస్) రిపోర్టు వెల్లడించింది. ‘కాశ్మీర్: బ్యాక్గ్రౌండ్, రీసెంట్డెవలప్మెంట్స్, అండ్యూఎస్పాలసీ’ పేరుతో దాదాపు 17 ఏళ్ల తర్వాత కాశ్మీర్అంశంపై రిలీజ్చేసిన రిపోర్టులో.. ఆర్టికల్370 రద్దు తర్వాత దక్షిణాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ బ్యాలన్సింగ్యాక్ట్అవసరమని సీఆర్ఎస్అభిప్రాయపడింది. దీనికోసం ఇండియా, పాక్ల మధ్య మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొంది. సరిహద్దు వివాదాల విషయంలో కాశ్మీరీల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇండియా, పాక్చర్చించుకుని, ఓ పరిష్కారానికి రావాలని అమెరికా చాలాకాలం నుంచీ చెబుతున్నట్లు సీఆర్ఎస్వివరించింది.
కాశ్మీర్లో వేర్పాటువాద టెర్రరిజం పెరిగితే దాని ప్రభావం అఫ్గాన్లో జరుగుతున్న శాంతి చర్చలపై తప్పకుండా పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిణామం పాకిస్తాన్కే లాభదాయకంగా ఉంటుందని చెప్పింది. కాశ్మీర్అటానమస్ను ఇండియా తొలగించడంపై పాకిస్తాన్ నేతల్లో కోపం ఉందని చెప్పింది. గతంలో ఇండియాలో జరిగిన టెర్రరిస్టుల మానవబాంబు(పుల్వామా) దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే మరోసారి ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య టెన్షన్లు ఎటుపోయి ఎటు తిరుగుతాయోనని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితులపై దక్షిణాసియా అంతటా ఆందోళన నెలకొందని సీఆర్ఎస్పేర్కొంది.