కాశ్మీర్​లో శాంతే మా కోరిక: అమెరికా 

కాశ్మీర్​లో శాంతే మా కోరిక: అమెరికా 

అఫ్గాన్​ చర్చలపైనా దీని ప్రభావం

వెల్లడించిన అమెరికా  సీఆర్ఎస్ ​రిపోర్టు

వాషింగ్టన్: కాశ్మీర్​లో శాంతియుత వాతావరణం నెలకొనాలని, మానవ హక్కులను గౌరవించాలని కోరుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. అటానమస్ రద్దుతో కాశ్మీర్​లో టెన్షన్ నెలకొందని కాంగ్రెషనల్​రీసెర్చ్​సర్వీస్(సీఆర్ఎస్) రిపోర్టు వెల్లడించింది. ‘కాశ్మీర్: బ్యాక్​గ్రౌండ్, రీసెంట్​డెవలప్​మెంట్స్, అండ్​యూఎస్​పాలసీ’ పేరుతో దాదాపు 17 ఏళ్ల తర్వాత కాశ్మీర్​అంశంపై రిలీజ్​చేసిన రిపోర్టులో.. ఆర్టికల్​370 రద్దు తర్వాత దక్షిణాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ బ్యాలన్సింగ్​యాక్ట్​అవసరమని సీఆర్ఎస్​అభిప్రాయపడింది. దీనికోసం ఇండియా, పాక్​ల మధ్య మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొంది. సరిహద్దు వివాదాల విషయంలో కాశ్మీరీల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇండియా, పాక్​చర్చించుకుని, ఓ పరిష్కారానికి రావాలని అమెరికా చాలాకాలం నుంచీ చెబుతున్నట్లు సీఆర్ఎస్​వివరించింది.

కాశ్మీర్​లో వేర్పాటువాద టెర్రరిజం పెరిగితే దాని ప్రభావం అఫ్గాన్​లో జరుగుతున్న శాంతి చర్చలపై తప్పకుండా పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిణామం పాకిస్తాన్​కే లాభదాయకంగా ఉంటుందని చెప్పింది. కాశ్మీర్​అటానమస్​ను ఇండియా తొలగించడంపై పాకిస్తాన్​ నేతల్లో కోపం ఉందని చెప్పింది. గతంలో ఇండియాలో జరిగిన టెర్రరిస్టుల మానవబాంబు(పుల్వామా) దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే మరోసారి ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య టెన్షన్లు ఎటుపోయి ఎటు తిరుగుతాయోనని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితులపై దక్షిణాసియా అంతటా ఆందోళన నెలకొందని సీఆర్ఎస్​పేర్కొంది.