గతవారం నుంచి బంగారం, వెండి రేట్లు క్రమంగా మళ్లీ పైపైకి చేరుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వేళ అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ రేట్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో మారిన ధరలను పరిశీలించటం బెటర్.
జూలై 20న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.17 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 346గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 150గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 20, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 35వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.
