ఖైరతాబాద్, వెలుగు: అమీన్పూర్పెద్ద చెరువు తమ ప్లాట్లను ముంచేసిందని పలువురు బాధితులు వాపోయారు. ఇరిగేషన్అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడ్డారు. పట్టా భూముల్లో లేఅవుట్వేస్తే.. 1986లో ప్లాట్లు కొనుగోలు చేశామని, హెచ్ఎండీఏ, పంచాయతీ అనుమతులు కూడా ఉన్నాయని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వీఎస్సార్బ్రహ్మానందరావు, జాయింట్సెక్రటరీ పి.విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల కుటుంబాలకు చెందిన స్థలాలు పెద్ద చెరువులో కలిసి పోయాయన్నారు.
ఇరిగేషన్అధికారులు రెండు చెరువులను కలిపి ఎఫ్ టీఎల్ గా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి రీసర్వే చేయాలని, ప్లాట్లను తిరిగి అప్పగించాలని కోరారు. చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు కాగా, తమ స్థలాలను కలిపి ప్రస్తుతం 400 ఎకరాలకు చేరుకుందన్నారు. పైనుంచి వచ్చిన నీళ్లన్నీ ప్లాట్లలోకి చేరాయని వాపోయారు. ఇల్లు కట్టు కుందామంటే ఎఫ్టీఎల్ పరిధి అంటున్నారని, రిజిస్టర్డ్భూములు ఎఫ్ టీఎల్ పరిధిలోకి ఎలా మారుతాయని ప్రశ్నించారు. సమావేశంలో జేఏసీ సభ్యులు డి.నర్సింగరావు, కాసోజు నవనీత, కోశాధికారి టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.