
నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుతో అక్కడి పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్రమంత్రి అమిత్షా. ఆదివారం (జూన్29) నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు అమిత్షా.ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్షా..నిజామాబాద్ప్రజల 40యేళ్ల పసుపు బోర్డు కలను ప్రధాని మోదీ సర్కార్ నెరవేర్చిందన్నారు.
బోర్డు ఏర్పాటుతో తెలంగాణ పసుపు రైతులకు ప్రధానిమోదీ పసుపుబోర్డును కానుకగా ఇచ్చారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల జీవితం మారుతుందన్నారు. ర్డు ఏర్పాటుతో నిజామాబాద్పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. బోర్డు ఆధ్వర్యంలో ప్యాకింగ్,బ్రాండింగ్, మార్కెటింగ్,ఎక్స్పోర్టు జరుగుతుందని అన్నారు అమిత్షా.
►ALSO READ | నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
పసుపు ప్రాచీన కాలంనుంచి మన జీవన విధానం ఓ భాగం..యాంటీవైరల్, యాంటీ సెప్టిక్ గా పసుపు పనిచేస్తుందన్న అమిత్షా..పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి నిజామాబాద్జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రి అమిత్ షా..నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకోసం ఎంపీ అర్వింద్కేంద్రంతో గట్టిగా కొట్లాడారని గుర్తుచేశారు. బోర్డు ప్రారంభించిన తర్వాత పసుపు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అనంతరం పసుపు ఉత్పత్తులను పరిశీలించారు.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలపై కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. పాకిస్తాన్ ఆటంబాంబు వేస్తామని బెదిరించింది. మన సైన్యం శతృభూభాగంలోకి చొచ్చకెళ్లి చిత్తు చేసింది. పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలతోపాటు.. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టామన్నారు అమిత్ షా.
మరోవైపు దేశంలోని నక్సలిజంపై మాట్లాడిన అమిత్ షా.. నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్ అవండి లేదంటే.. అంతమే అని హెచ్చరించారు. ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. మేం కాంగ్రెస్ మాదిరి కాదు.. ఆయుధాలు వదిలితేనే చర్చలు జరుపుతామన్నారు. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా ఆదివాసీలను అభివృద్దిని మావోయిస్టులను అడ్డుకుంటున్నారని అమిత్ షా అన్నారు.