
నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. పసుపు బోర్డులోని వసతులను పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న అమిత్ షా వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,ఎంపీ అర్వింద్, లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు సీతక్క,తుమ్మల నాగేశ్వర్ రావు ,బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సర్కార్ కు కేంద్రం సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేశామన్నారు. పసుపు బోర్డు ప్రారంభించడం ఆనందంగాఉందన్నారు.