ముగిసిన కేబినెట్ బేటీ… 11గంటలకు అమిత్ షా కీలక ప్రకటన

ముగిసిన కేబినెట్ బేటీ… 11గంటలకు అమిత్ షా కీలక ప్రకటన

కశ్మీర్ పై దేశ వ్యాప్తంగా నెలకొన్న సస్పెన్స్ కు కాసేపట్లో  హోంశాఖ మంత్రి అమిత్ షా తెరదించనున్నారు. కశ్మీర్ అంశంపై రాజ్యసభలో 11 గంటలకు అమిత్ షా ప్రకటన చేయనున్నారు. ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర  కేబినెట్ కశ్మీర్ అంశంపైనే చర్చింది. కేబినెట్ సమావేశం ముగియడంతో తన కార్యాలయానికి వెళ్లిపోయారు అమిత్ షా. కేబినెట్ సమావేశ ప్రారంభానికి గంట ముందే ప్రధాని నివాసానికి వచ్చారు హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశంలో పాల్గొన్నారు.