మోడీ నిర్ణయం వల్ల యువతకు ఎంతో ప్రయోజనం

మోడీ నిర్ణయం వల్ల యువతకు ఎంతో ప్రయోజనం

‘అగ్నిపథ్’ ఆందోళనల పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. " కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్మీ నియామక ప్రక్రియ గత రెండేళ్లుగా ఆగిపోయింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ అనే స్కీమ్ ని తీసుకువచ్చి అభ్యర్ధుల వయసు పరిమితిని రెండేళ్లు పెంచారు. 2022 కి సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన చాలా మంది యువతకు లబ్ధి కలుగుతుంది. అగ్నిపథ్ పథకం ద్వారా యువత దేశానికి సేవ చేయ‌వ‌చ్చు, వారు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతారు.మోడీకి దన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.