130 మంది కార్యకర్తల్ని చంపిన హంతకులను జైల్లో పెడ్తం

130 మంది కార్యకర్తల్ని చంపిన హంతకులను  జైల్లో పెడ్తం

బెంగాల్ లో రాక్షస పాలన నడుస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తృణముల్ గుండాల అరాచకాలతో 130 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని...బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే కార్యకర్తల్ని చంపిన హంతకులను కఠినంగా శిక్షిస్తామన్నారు.  రాష్ట్రంలో సరస్వతి పూజ, దుర్గా పూజ చేయాలన్న ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.తృణముల్ అరాచకాల్ని తిప్పికొట్టాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు అమిత్ షా. మమతాను ముఖ్యమంత్రి చేయడం కావాలా లేక....సోనార్ బంగ్లా కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లోని పర్బా మేధినీపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో షా పాల్గొన్నారు.