జమ్మూకశ్మీర్ లో మొదలైన అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. శాంతికి భంగం కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సక్సెస్ కానివ్వబోమన్నారు. 3 కుటుంబాలు జమ్మూకశ్మీర్ ను దోచుకున్నాయన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించిన తర్వాత... 12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2022 కల్లా 51వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని... లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు అమిత్ షా. జమ్మూలో పర్యటిస్తున్న అమిత్ షా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.