కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

2019 ఆగస్ట్ ఐదో తేదీన జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం, అవినీతి, నెపోటిజం అంతనికి బీజం పడిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. శాంతికి విఘాతం కలిగిచేందుకు ప్రయత్నించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏ ఘటనను అంగీకరించబోమన్నారు. ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందని, ఆ తర్వాత రాష్ట్ర హోదా కూడా వస్తుందని చెప్పారు అమిత్ షా. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. కశ్మీర్  టూర్ లో ఉన్న ఆయన శ్రీనగర్ లో అధికారులతో సమావేశమయ్యారు. భద్రతపై చర్చించారు.