భారీ వర్షాల కారణంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా పడింది. ముందుగా 2023 జూలై 29న అమిత్ షా... హైదరాబాద్ షెడ్యూల్ ఖారరైంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తు్ండటంతో టూర్ వాయిదా పడింది.
వాస్తవానికి 2023 జూన్ 15న ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. ఈ సభకు తాను వస్తానని అమిత్ షా కూడా మాట ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ గుజరాత్ లో వచ్చిన సైక్లోన్ తో అది వాయిదా పడింది .
దీంతో ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా ప్రోగ్రామును జూలై 29కి హైదరాబాద్ కు మార్చుకుంది స్టేట్ బీజేపీ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండంటంతో మరోసారి అమిత్ షా టూర్ వాయిదా పడింది. త్వరలోనే అమిత్ షా టూర్ ఖారరు అయ్యే ఛాన్స్ ఉంది.