ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ వచ్చే నెలలో రిలీజవుతోంది. ప్రమోషన్స్లో భాగంగా ఒక్కో అప్డేట్నీ రివీల్ చేసి ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది టీమ్. నిన్న ఇంకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పింది. ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్ని అమితాబ్ నేరేట్ చేశారు. దీంతో తమ మూవీ మరింత స్పెషల్గా మారిందని ప్రకటించిన టీమ్.. అమితాబ్కి థ్యాంక్స్ చెప్పింది. దీన్నిబట్టి తెలుగులో కూడా ఎవరైనా స్టార్ హీరోతో వాయిస్ ఇప్పించే చాన్స్ ఉంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్తో అంచనాలు పెరిగాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ
క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి.