కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే పాకిస్తాన్‌‌‌‌కు వేసినట్లే : నవనీత్ కౌర్

కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే పాకిస్తాన్‌‌‌‌కు వేసినట్లే : నవనీత్ కౌర్

షాద్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేస్తే పాకిస్తాన్‌‌‌‌కు వేసినట్లేనని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్‌‌‌‌కౌర్‌‌‌‌ చెప్పారు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ డీకే అరుణతో కలిసి బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌నగర్‌‌‌‌లో రోడ్‌‌‌‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీకే అరుణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగు వారు ఆడపడుచులను ఎంతో గౌరవిస్తారని, మరి రేవంత్‌‌‌‌రెడ్డి డీకే అరుణను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

 ఆడవాళ్లను అవమానించే వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో మహిళలను మోసం చేశారని విమర్శించారు. రూ. 500 సిలిండర్‌‌‌‌, గృహలక్ష్మి ఇచ్చారా ? అని ప్రశ్నించారు. డీకే అరుణ గెలిస్తే మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా పేరును పాలమూరు పేరు పెట్టాలని కోరారు. ఇండియా కూటమి ఒక ‘హిజ్రాల సమూహం’ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్‌‌‌‌రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, నాయకులు మహేందర్‌‌‌‌రెడ్డి, పాతపల్లి కృష్ణారెడ్డి, కక్కునూరు వెంకటేశ్‌‌‌‌ గుప్తా పాల్గొన్నారు.