
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్పాల్ సింగ్, కాశ్మీరీ నేత షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం లోక్సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పార్లమెంట్ కాంప్లెక్స్లోని స్పీకర్ చాంబర్లో లాంఛనాలు పూర్తిచేశారు. లోక్సభ ఎన్నికల్లో అమృత్పాల్ సింగ్(31) పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నుంచి గెలవగా.. అబ్దుల్ రషీద్(56) జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా నుంచి విజయం సాధించారు.
అమృత్పాల్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఎంపీగా ప్రమాణం చేసేందుకు అతడికి నాలుగు రోజుల పాటు బెయిల్ లభించింది. ఇంజినీర్ రషీద్గా ప్రసిద్ధి పొందిన షేక్ అబ్దుల్ రషీద్ టెర్రర్ ఫండింగ్ కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద తీహార్లో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడికి ప్రమాణ స్వీకారం కోసం ప్రయాణ సమయం మినహా కేవలం 2 గంటల పెరోల్ మాత్రమే లభించింది. ప్రమాణం చేసిన వెంటనే అతడిని తిరిగి జైలుకు తరలించారు.