ఫుడ్ బ్రాండ్లలో అమూల్ టాప్..

ఫుడ్ బ్రాండ్లలో అమూల్ టాప్..

న్యూఢిల్లీ: భారతదేశ ఫుడ్ సెక్టార్‌‌లో అగ్రగామి బ్రాండ్‌‌గా తన స్థానాన్ని అమూల్  నిలబెట్టుకుంది.  దీని బ్రాండ్ విలువ 4.1 బిలియన్ డాలర్లు (రూ.35 వేల కోట్లు) గా ఉంది. ఢిల్లీ- ఎన్‌‌సీఆర్‌‌‌‌ బేస్డ్  మదర్ డైరీ 1.15 బిలియన్ డాలర్ల (రూ.9,900 కోట్ల) బ్రాండ్ విలువతో రెండో స్థానంలో ఉందని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా  తన తాజా రిపోర్ట్‌‌లో పేర్కొంది.  

ఈ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో టాప్ ఫుడ్ బ్రాండ్‌‌లలో బ్రిటానియా  మూడో స్థానంలో,  కర్నాటక బేస్డ్ డెయిరీ కంపెనీ  నందిని  నాలుగో స్థానం, డాబర్‌‌‌‌ ఐదో స్థానంలో నిలిచాయి.   మిగిలిన సెక్టార్లను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలోని టాప్ 100 బ్రాండ్స్‌‌ లిస్ట్‌‌లో అమూల్‌ 17వ స్థానంలో ఉంది.  గత ఏడాది 3వ స్థానం నుంచి 2025లో 2వ స్థానంకు మదర్ డెయిరీ ఎగిసింది. మొత్తంగా 35వ స్థానం దక్కించుకుంది.