- యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇదే అంశాన్ని టచ్ చేస్తూ వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పరంపర’ ఆకట్టుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్కి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. జగపతిబాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర, ఇషాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ సిరీస్ ట్రైలర్ను నిన్న సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు రామ్ చరణ్.
‘ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు’ అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ‘ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి’ అంటున్నాడు నవీన్ చంద్ర. మూడు జెనరేషన్స్కి చెందిన క్యారెక్టర్స్ మధ్య క్లాష్ ఈ సిరీస్లో మెయిన్ కాన్సెప్ట్. స్ట్రాంగ్ ఎమోషన్స్తో సెకెండ్ సీజన్ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మేకర్స్. ఆమని, కస్తూరి, ఆకాంక్ష సింగ్, తేజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జులై 21 నుంచి స్ట్రీమింగ్.