ఫుల్లుగా తాగి.. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు డస్ట్ బిన్ లోనే పోశాడు

ఫుల్లుగా తాగి.. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు డస్ట్ బిన్ లోనే పోశాడు

ఫుల్లుగా మద్యం తాగి.. ఎమర్జెన్సీ వార్డులో హల్ చల్​
డస్ట్ బిన్ లోనే మూత్ర విసర్జన చేసిన సిబ్బంది
రోగులతోనూ దురుసుగా ప్రవర్తించారు
తమను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరింపులు
కేకలు అరుపులతో రోగులు, అటెండెంట్లు పరుగులు
మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఘటన 

మహబూబాబాద్ అర్బన్ : మహబూబూబాద్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో హాస్పిటల్​ సిబ్బంది హల్ చల్​చేశారు. భరత్, కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు సాయి ఏజెన్సీ ద్వారా రిక్రూట్​అయ్యారు. నిన్న శుక్రవారం (జూన్ 30న) రాత్రి  పేషెంట్ల ముందే ఫుల్​గా మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించారు. ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్లకు వైద్యం అందిస్తున్న చోటే డస్ట్ బిన్​లో మూత్ర విసర్జన చేశారు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరంటూ ఒంటికాలిపై లేచారు. దీంతో పేషెంట్లు, అటెండెంట్లు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సిబ్బంది తీరుపై చాలాసార్లు కంప్లైంట్​చేసిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పేషెంట్లు, అటెండెంట్లు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మారుమూల పీహెచ్ సీలు, సబ్ సెంటర్ల పరిస్థితి ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.