శంషాబాద్, వెలుగు: జై యోగేశ్వర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్ మండలంపెద్ద గోల్కొండ ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి ముక్కుపుడకకు మంగళవారం వేలం పాట నిర్వహించారు. మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఆనే గౌని శ్రీకాంత్ గౌడ్ రూ. 2,25 లక్షలకు -అమ్మవారి ముక్కుపుడకను కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పెద్ద గోల్కొండ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలు వ్యాపార సంస్థలు బాగా అభివృద్ధి చెందాలని దుర్గామాత అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు. అనంతరం అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి ముక్కుపుడక సొంతం చేసుకున్న శ్రీకాంత్ గౌడ్ను ఘనంగా సన్మానించారు.