
కామారెడ్డిటౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ నేతల మాటల్ని వక్రీకరించి బీఆర్ఎస్ నేతలు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడంపై లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రైతుల పక్షపాత పార్టీ అన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్పండ్ల రాజు, మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాక జ్నానేశ్వరి, లీడర్లు కారంగుల ఆశోక్రెడ్డి, పాత శివకృష్ణమూర్తి, గుడుగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.