నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో విచ్చలవిడిగా జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ఎదుట ధర్నా చేశారు. స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారంతో ఆక్రమణలు పెరిగాయని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
మూడు గంటల పాటు ఆందోళన చేసిన గ్రామస్తులు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, ఏసీపీ ప్రకాశ్ వచ్చి నచ్చజెప్పినా వినలేదు. డీఎఫ్వో సిద్ధార్థ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
