- 25 తులాల బంగారం, కిలో వెండితో ఉన్న లాకర్ ఎత్తుకెళ్లిన దొంగలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సిటీలోని సుభాష్నగర్ ఏరియాలో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ రవికుమార్ ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. లాకర్లో 25 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు, కొంత నగదు ఉంది. త్రీ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన రవికుమార్ అడిషనల్ కలెక్టర్గా పని చేసి మూడేండ్ల కింద రిటైర్ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న ఆయన నెలకోసారి ఫ్యామిలీతో వచ్చి వెళ్తుంటారు. ఇల్లు క్లీన్ చేసేందుకు పని మనిషిని ఏర్పాటు చేయగా, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వచ్చి వెళ్తోంది.
లాక్ వేసిన ఇంట్లోకి మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వచ్చిన దొంగలు లాకర్ తెరుచుకోకపోవడంతో దానికి వెంట తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పని మనిషి వచ్చి డోర్లు తెరిచి ఉండడంతో రవికుమార్కు తెలియజేసింది. ఆయన ఫోన్లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని సీసీ కెమెరా డీవీఆర్ను దొంగలు తీసుకెళ్లగా, కాలనీలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ముఖానికి ముసుగు ధరించిన ముగ్గురు దొంగలు బైక్పై వచ్చినట్లు గుర్తించారు. లాకర్ను దొంగలు ఎక్కడికి పట్టుకెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సిటీ శివారులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
