ఏపీలో ఆర్టీసీ విలీనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

ఏపీలో ఆర్టీసీ విలీనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

అమరావతి, వెలుగు: ఆర్టీసీ విలీనంలో ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. విలీన ప్రక్రియను 3 నుం చి 4 నెలల్లో పూర్తి చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను ఏర్పా టు చేస్తూ గురువారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ గ్రూప్ లో ఆర్థిక, రవాణా, జీఏడీ,న్యాయశాఖలకు సంబంధిం చిన ఉన్నతాధికారులను నియమించిం ది. నవంబర్ 15 లోపు రిపోర్ట్ ఇవ్వా లని సూచించిం ది. ఆర్టీసీ విలీన ప్రక్రియలో కీలకమైన ఉద్యోగుల జీతభత్యా ల చెల ్లింపు, ఆర్టీసీ రుణాలు, ఆస్తులను కమర్షియల్ తరహాలో వినియోగంపై ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుం ది. రవాణా శాఖలో ప్రత్యేకంగా ఏర్పా టు చేయనున్న పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఏర్పా టు, ఉద్యోగుల హోదా లు, పోస్టులు, జీతాలు, పే స్కేల్ విధి విధానాలపై ప్రతిపాదనలు రూపొందించనుంది. నిపుణుల కమిటీ నివేదికకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చాక సీఎం జగన్ పరిశీలనకు చేరుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.