
- న్యూజెర్సీ ప్రవాసుల సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్.. న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరించాలని తాను కోరడంతో ఆనంద్ మహీంద్రా అంగీకరించారని తెలిపారు.
కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.